ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న‌టుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 02:53 PM

టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర త‌ర‌ఫున నంద్యాల‌లో ఈ ఏడాది మే 11వ తేదీన‌ బ‌న్నీ ప్ర‌చారంలో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి అభిమానులు, జ‌నాలు పోటెత్తారు.అయితే, ఈ కార్య‌క్ర‌మానికి శిల్పార‌వి గానీ, అల్లు అర్జున్ త‌ర‌ఫున గానీ ముంద‌స్తు అనుమ‌తి తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో స్థానిక వీఆర్ఓ అనుమ‌తి లేకుండా భారీ జ‌న స‌మీక‌ర‌ణ జ‌రిగిందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో శిల్పార‌వితో పాటు బ‌న్నీపై సెక్ష‌న్ 144, పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘ‌న‌ కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసు విష‌య‌మై తాజాగా అల్లు అర్జున్‌ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం స్వీక‌రించింది. మంగ‌ళ‌వారం విచారించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com