ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం ఇందిరానగర్కు చెందిన పలివెల శ్రీనివాస్ మౌళిశంకర్(18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. గణితం సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై ఈనెల15న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాకవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కొమరాజులంక గోదావరి పుష్కర ఘాట్ వద్ద విద్యార్థి మృతదేహం లభ్యమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.