కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తెలిపారు.బీజేపీ లక్ష్యం మాత్రం వికసిత భారత్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా తయారు చేస్తామని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను విఫలం చేసిందని మండిపడ్డారు.