యూపీ ఎన్నికల ఫలితాలు దక్షిణాదిన కూడా ప్రతిబింబిస్తాయి : పురంధేశ్వరి
విజయవాడ, సూర్య బ్యూరో : కుల, మతాలకు అతీతంగా అయిదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి గెలిపించడం ప్రజాస్వామ్య విజయంగా మాజీ కేంద్రమంత్రి, భాజపా మహిళా మోర్చా జాతీయ ఇన్ఛార్జి పురందేశ్వరి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో విలేకరుల సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పురందేశ్వరి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అయిదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణలు, భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత పాలన, అభివృద్ధికి ప్రజలు తమ ఓటుతో మద్దతు తెలిపారని వ్యాఖ్యానిం చారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలుకుతూ భాజపాకే ప్రజలు ఓటు వేయడం ప్రజల్లో వచ్చిన పెద్ద మార్పుగా చెప్పారు. పెద్దనోట్ల రద్దును, సంస్క రణలను దుషచ్రారం చేసిన విపక్షనేతలు ఈ ఎన్నికలను భాజపా పాలనకు ప్రజా తీర్పుగా ప్రచారం చేశారని అన్నారు. దాంతో దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాల కోసం ఆ్త్రంగా ఎదురుచూసిందని, ప్రజలు మా్త్రం మోదీకే మద్ద తు తెలిపి విపక్షాల నోళ్లు మూయించారన్నారు. జమ్ము, కశ్మీర్ మాజీ ముఖ్య