శోకసంద్రంలో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయిన అభిమానులు నేడు ఆళ్లగడ్డలో అంతఃక్రియలు భూమా మరణంతో వాయిదా పడ్డ ఏపీ బడ్జెట్ సమావేశం కర్నూలు రాజకీయాలపై చెరగని ముద్రవేసిన భూమా భూమా మృతికి ప్రముఖుల సంతాపాలు భూమా అంత్యక్రియలకు సీఎం బాబు హాజరు ఎమ్మెల్యే నాగిరెడ్డి మృతి పట్ల కేసీఆర్ సంతాపం అఖిలప్రియను ఫోన్లో పరామర్శించిన జగన్, విజయలక్ష్మి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర నమ్ముకొన్న వారి కోసం దేనికైనా సై రాజకీయాల్లో చురుగ్గా
ఆళ్లగడ్డ, నంద్యాల, మేజర్న్యూస : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి(53) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఆళ్లగడ్డలోని తన నివాసంలో వార్తాపత్రిక చదువుతూ ఒక్కసారిగా కుప్పుకూలిపోయారు. అక్కడే ఉన్న ఆయన రెండో కూతురు నాగమౌనిక వెంటనే భూమాను పట్టణంలోని రామలింగారెడ్డి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో పట్టణంలోని ప్రముఖ వెద్యులందరూ ఆసుపత్రికి చేరుకుని ప్రథమ చికిత్స ప్రారంభిం చారు. గుండె కొట్టుకోవడం నిలిచిపోవడంతో సీపీఆర్ చికిత్స అందించారు. ఈటీ ట్యూబ్తో అంబూ బ్యాగ్ను జతచేసి కృత్రిమ శ్వాస అందిస్తూ నంద్యాలలోని సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స అందించేందుకు శాయశక్తులా కృషి చేశారు. అయినప్పటికీ చికిత్సకు ఆయన శరీరం సహకరించ కపోవడంతో తుదిశ్వాస విడిచారు. భూమాకు చికిత్స అందించిన సమయంలో ఆయన వద్ద పెద్ద కుమార్తె,