అశేష జనవాహిని పవన్ రాకపోసం ఎదురుచూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో జనసేన నిర్వహిస్తున్న బహిరంగసభను జిల్లాలో అత్యధిక జనం హాజరైన సభగా విశ్లేషకులు భావిస్తున్నారు. దూరప్రాంతాలనుండి మహిళలు, యువకులు తరలివస్తుండగా.. సభ విజయవంతం చేసేందుకు రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి భారీ సంఖ్యలో జనసైనికులు వస్తున్నారు.