అమరావతి : ఈనెల 15, 16తేదీల్లో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ స్ట్రాటజీ కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీ చేసిన నమ్మకద్రోహాన్ని ఇంటింటికి తిరిగి వివరించాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకుంటానన్నారు. గత 13రోజుల్లో సభ్యత్వ నమోదు 8.92లక్షలకు చేరిందన్నారు. ఈనెల 20న నెల్లూరులో చేపట్టే ధర్మపోరాట సభను విజయవంతం చేయాలన్నారు. కరపత్రాలు, గోడరాతల ద్వారా బీజేపీ చేసిన నమ్మకద్రోహాన్ని వివరించాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ప్రజాభిప్రాయం తీసుకోవాలన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలన్నారు.