మాజీమంత్రి పసుపులేటి బాలరాజుకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓట్లు చీలి అభివృద్దికి ఆటంకం కలగకూడదనే ఆనాడు టీడీపీకి మద్దతిచ్చానని.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జనసేన పార్టీ భావితరాలకు అండగా నిలబడుతుందన్న ఆయన పర్యావరణాన్ని పరిరక్షించాలనేది నా ఉద్దేశం అన్నారు. జనసేన పార్టీ ప్రజల్లో ఉన్న సమస్యలను సమకోణంలో చూడాలని కోరుకుంటోందన్నారు.