ఢిల్లీ: ఢిల్లీలో అంతర్జాతీయ యోగా సమ్మేళనాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మూడు రోజుల పాటు తల్కతోరా ఇండోర్ మైదానంలో యోగా సమ్మేళనం కొనసాగనుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా యోగా సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్, యోగాగురు బాబా రాందేవ్, వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, వివిధ రాష్ర్టాలు, దేశాల నుంచి ప్రతినిధులు సమ్మేళనానికి హాజరయ్యారు.