తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. అందానికే అసూయ పుట్టేలా ఉన్న సావిత్రి ఎన్టీఆర్- ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మహానటి రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోను ఎందరికో ఆసరాను అందించింది. ఇప్పుడు ఆ మహానటి జీవితం ఆధారంగా ఓ మూవీ ని తీస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇందులో సమంత తో పాటు కీర్తి సురేష్ ముఖ్య పాత్రలలో నటించనున్నారు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహానటి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. స్వప్న సినిమా బేనర్ పై రూపొందనున్న ఈ చిత్రం అందరు మెచ్చేలా ఉంటుందని టీం అంటుంది.