న్యూఢిల్లీ : కేరళకు అండగా నిలిచేందుకు యావత్ దేశం ముందుకు వస్తోంది. కేరళ వరద బాధితులకు సహాయం చేయాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇవాళ రాజ్యసభ, ఉపరాష్ట్రపతి సచివాలయం ఉద్యోగులతో వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ కలిసి సమీక్షించారు. కేరళకు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని రాజ్యసభ, ఉపరాష్ట్రపతి సచివాలయం ఉద్యోగులు నిర్ణయించారు.