ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేటి విజయవాడ పర్యటన రద్దైంది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విజయవాడ పర్యటన రద్దు చేసుకున్నారు. హూటాహుటిన ఏజెన్సీ ప్రాంతమైన చింతూరుకు బయలుదేరి వెళ్లారు.