శ్రీకాకుళం : వంశధార రిజర్వాయర్లోకి నీటిని మళ్ళించిన సందర్భంగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టులోకి నీరు మళ్లించిన రోజును తన జీవితంలో మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మి, శాసనసభ్యులు గుండ లక్ష్మీ దేవి, జిల్లా కలెక్టర్ కె ధనంజయ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కెవిఎన్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ –2 పి రజనీకాంత రావు, పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సి. ఎం. త్రివిక్రమ వర్మ, జలవనరుల శాఖ ఎం. సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం మలగాం పంచాయతీ పరిధిలోని ఉదయపురం, దేపల్లివానిపేట, సూరాడవానిపేట, కారిపేట పరిధిలో సుమారు 550 ఎకరాలకు నూతన కాలవ నిర్మించి సాగునీరు విడుదల చేసిన సందర్భంగా ఆ ప్రాంతాలకు చెందిన రైతులు, ప్రజలు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.