చెన్నై : డిఎంకె కార్యనిర్వహాక కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిఎంకె పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న స్టాలిన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. కరుణానిధి మృతి తరువాత డిఎంకె తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశానికి కరుణానిధి కుమార్తె కనిమొళి హాజరయ్యారు. కాగా డిఎంకె అధ్యక్షుడిగా స్ఠాలిన్ను నియమించడాన్ని కరుణానిధి మరొక కుమారుడు అళగిరి వ్యతిరేకిస్తున్నారు.