నెల్లూరు జిల్లాలోని దక్కిలి మండలం లింగసముద్రం వాగు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 30 మంది 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కమ్మపల్లి నుంచి దందోలు ఉప్పరపల్లిలో ఓ కార్యానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.