తెలుగుదేశం ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు లోక్ సభ స్పీకర్ ఆమోదంపై స్పందించిన ఆ పార్టీ ఎంపీ రామ్మోహననాయుడు తెలుగుదేశం సత్తా ఇది అని పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటంలో తెలుగుదేశం వెనక్కు తగ్గదన్నవిషయాన్ని స్పీకర్ ఇప్పటికి అర్ధం చేసుకున్నారని ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడం చంద్రబాబుపై ఆ పార్టీలకు ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.