తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 213వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 213 వ రోజు పాదయాత్రను గొల్లల మామిడాడ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర పెద్దాడ, కైకవోలు, పెదపూడి, దొమ్మాడ మీదుగా కరకుదురు వరకు కొనసాగనుంది.