కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధనకు ఎంపీ సి.ఎం.రమేష్ మూడో రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. కడప జడ్పీ కార్యాలయ ఆవరణలో సి.ఎం.రమేశ్ దీక్షను కొనసాగిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకు దీక్ష విరమించేది లేదని సి.ఎం.రమేశ్ స్పష్టం చేస్తున్నారు. సి.ఎం.రమేశ్కు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీలు కేశినేని నాని, అశోక్ గజపతి, మాగంటి, అవంతి, నారాయణరావు, సీతామహాలక్ష్మి, రవీంద్రలు దీక్షా శిబిరం వద్ద చేరుకుని సి.ఎం.రమేశ్కు సంఘీభావం తెలిపారు.