రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. రాజధాని ప్రాంతంలో ప్రవాసాంధ్రుల ఎన్ఆర్టీ ఐకానిక్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలతో పాటు గుంటూరు జడ్పీ చైర్పర్సన్ జానీమూన్, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, రాష్ట్ర ప్రవాసాంద్రుల వ్యవహారాల సలహాదారు వేమూరు రవికుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.