శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లో రాజకీయాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పిడిపి-బిజెపి కూటమినుంచి బిజెపి వైదొలగడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీనితో ముఖ్యమంత్రి పదవికి ముఫ్తీ తన రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా గవర్నర్తో భేటీ అయ్యారు. జమ్ము కాశ్మీర్లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 87 కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 44 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం జమ్ము కాశ్మీర్లో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి. పిడిపి 28, బిజెపి 25, ఎన్సి 15, కాంగ్రెస్ 12, ఇతరులు 7. ముఫ్తీ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.