గుంటూరు : గుంటూరు జిల్లా బొప్పూడీ సమీపంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదానికి గురైన కోల్డ్ స్టోరేజిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారారు పరిశీలించారు. కోల్డ్ స్టోరేజిలలో భద్రత పరంగా సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్లనే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. బొప్పూడి కోల్డ్ స్టోరేజి లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులకు సత్వరమే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పుల్లారావు చెప్పారు.