ఏలూరు: రూ.1500 కోట్లతో రైల్వే డబ్లింగ్ లైన్ పనులు చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆర్.ధనుంజయ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు రైల్వేస్టేషన్లో డీఆర్ఎం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ నిడదవోలు-భీమవరం, భీమవరం-గుడివాడ మధ్య, గుడివాడ-విజయవాడ, గుడివాడ-మచిలీపట్నం మధ్య రైల్వే డబ్లింగ్లైన్ పనులు చేపడుతున్నామనారు.