ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదట జనంతో పొత్తు ఆ తరువాత జనసేనతో,,,సోము వీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 12:02 AM

మొదట జనంతో పొత్తు ఆ తరువాత జనసేనతో పొత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పొత్తు జనంతోనేనని స్పష్టం చేశారు. వస్తే జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్నారు. అంతేకానీ.. టీడీపీ, వైసీపీ లాంటి కుటుంబ పార్టీలతో కలిసేది లేదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ఇరు పార్టీల నేతలు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. తాజాగా పొత్తులపై సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


ఇప్పుడే కాదు.. గతంలోనూ సోము వీర్రాజు ఇలాంటి కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వీర్రాజు ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారని.. 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తుందని చెప్పారు. ఒకవేళ ఎవరికి ఎటువైపు ఇంట్రెస్ట్ ఉన్నా.. అటు వెళ్లొచ్చని స్పష్టం చేశారు. తాము మాత్రం టీడీపీ, వైఎస్సార్సీపీతో కలిసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్‌పై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com