షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఒ) సదస్సులో పాల్గొనడానికి సభా ప్రాంగణానికి వచ్చిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్వాగతం పలికారు. ఈ సదస్సులో పాల్గొనడానికి భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడకు వచ్చారు. మరికొద్దిసేపటిలో ఈ సదస్సు ప్రారంభం కానున్నది.