తిరుపతి : టిటిడి బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. టిటిడి బోర్డులో ఎమ్మెల్యే అనితను నియమించడంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన వీడియోను ప్రభుత్వం పరిశీలించింది. దీంతో ఎమ్మెల్యే అనిత వ్యవహారంపై సిఎం చంద్రబాబు అధికారులను నివేదిక కోసం ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. హిందూమత విశ్వాసాలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.