పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. బచావత్ తీర్పునకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందని సిడబ్ల్యుసి సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు, నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా తెలిపింది. కొత్తగా మరొకసారి అనుమతులు తీసుకునేలా ఆదేశించాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే అనుమతులకు అనుగుణంగానే నిర్మాణాలు సాగుతున్నాయని ఎపి ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది.