న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఆ పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అధిష్టానం పరిశీలనలో సోము వీర్రాజు, మాణిక్యాల రావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి పేర్లు ఉన్నాయి. పార్టీ విధేయుల కోటాలో సోము, మాణిక్యాల రావు పేర్లు ఉండగా, ఎన్నికల కోణంలో కన్నా, పురందేశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎన్టిఆర్ సానుభూతి ఓట్లు చీల్చాలనుకున్నా, టిడిపి అసంతృప్తులను చేరదీయాలనుకున్నా పురందేశ్వరిని ఎంపిక చేయాల్సి ఉంటుందని కొందరు నేతలు పేర్కొన్నారు. కోస్తాలో బలమైన కాపు వర్గంలో ప్రభావవంతమైన నేతగా ఉన్న కన్నా పేరును పరిశీలించే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.