చెన్నై : కావేరీ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో విపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. డిఎంకె పార్టీ పిలుపు మేరకు తమిళనాడులో బంద్ జరుగుతోంది. ఈ బంద్కు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ తమ మద్దతు ప్రకటించాయి. మెరీనా బీచ్ వద్ద ధర్నాలో పాల్గొన్న డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ తన అనుచరులతో కలిసి రోడ్డును దిగ్బంధనం చేయడంతో పోలీసులు స్టాలిన్ను అరెస్టు చేశారు. స్టాలిన్ను బలవంతంగా మోసుకెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు.