లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని చార్బాగ్ రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ నలుగురు వ్యక్తుల నుంచి 6 కేజీల బంగారాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడ్డ బంగారాన్ని మయన్మార్ నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.