న్యూఢిల్లి : కాంగ్రెస్ పార్టీ తమ వెబ్సైట్ యూజర్ల డేటాను సింగపూర్లోని తమ మిత్రులకు అందజేస్తోందని బిజెపి ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన విమర్శలకు ప్రతివిమర్శగా బిజెపి ఈ ఆరోపణ చేసింది. ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నరేంద్ర మోడీ యాప్లో రిజిస్టరైన యూజర్ల డేటాను అమెరికాలోని తన మిత్రులకు అందజేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన బిజెపి నేత అమిత్ మాల్వీయ అదేవిధమైన ఆరోపణలతో ట్వీట్ చేశారు.