చెన్నై : కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శశికళ భర్త ఎం.నటరాజన్ (75) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. నటరాజన్ కిడ్నీ సంబంధిత సమస్యతో రెండు వారాల కిత్రం చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన గతంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. నటరాజన్ 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. ఆయన డీఎంకేలో కీలక పాత్ర పోషించారు. జయలలితకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను చూసేందుకు శశికళ ఇప్పటికే పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహార కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నవిషయం తెలిసిందే.