అమరావతి: రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. నిన్న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం పవన్ మానుకోవాలన్నారు. పవన్కు అత్తారింటికి దారెటో తెలియదు.. ఏ అత్త ఇంటికి పోవాలో తెలియదని ఎద్దేవా చేశారు. రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని పేర్కొన్నారు.