అమరావతి: గుంటూరు జిల్లా నూజండ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రైతు నుంచి లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. రైతు నుంచి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా సర్వేయర్ నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.