ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 10, 2018, 02:03 PM

అమరావతి : అమరావతి సచివాలయంలో సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై  సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం తమ మూడో అభ్యర్థిని నిలబెట్టదని ప్రచారం ఉన్నా... అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి స్పష్టతను అధిష్ఠానం ఇవ్వలేదు. పార్టీ తరఫున ఇద్దరినే నిలబెట్టాలా లేదా మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించాలా అనే అంశంపై ఓ స్పష్టత వచ్చాక అప్పుడు అభ్యర్థులు ఎవరనే దానిపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి లేదా రేపు అర్ధరాత్రి లోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com