రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ యాదవ్, కాపు వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు స్థానాల్లో ఇప్పటికే రెండు టీడీపీకి ఖరారయ్యాయి. ఈ రెండింటిలోనూ ఆ వర్గాలకు చెందిన వారికే కేటాయించాలని భావిస్తున్నారంట చంద్రబాబు. ఈ నేపథ్యంలో కాపు, సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు కళా వెంకట్రావ్, యనమలతో సీఎం చర్చలు జరుపుతున్నారు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. రెండో అభ్యర్థిగా సీఎం రమేష్ పేరు గట్టిగా వినిపిస్తున్నా.. ఆయనకు చంద్రబాబు హ్యాండివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండో అభ్యర్థిగా కాపు వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.
మూడో స్థానానికి పోటీ చేయాలా? వద్దా? అన్న నిర్ణయానికి సీఎం చంద్రబాబు ఇంకా ఒక స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లేదా.. రేపు అభ్యర్థులను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.