దుబాయ్లో గుండె పోటుతో మృతి చెందిన సినీనటి శ్రీదేవి భౌతికకాయం తరలింపునకు న్యాయపరమైన ప్రక్రియ పూర్తయింది. మరికాసేపట్లో శ్రీదేవి భౌతికకాయాన్ని ఫోరెన్సిక్ సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. యూఏఈ నిబంధనల వల్ల ఈ నెల 24న రాత్రి మృతి చెందిన శ్రీదేవి పార్థివదేహం తరలింపులో జాప్యం జరిగింది. శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఈ రోజు ముంబైకి తీసుకురానున్నారు. భౌతికకాయం తరలింపునకు ఇండియన్ కాన్సులేట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని రిలయన్స్ ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకురానున్నారు. ఈ సాయంత్రానికి శ్రీదేవి పార్ధీవ దేహం ముంబైకి చేరుకునే అవకాశం ఉంది.