విశాఖ: ఆధ్యాత్మికత, సంతోషం కలయికతో సమాజంలో వృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో సోషల్ ఐకాన్పై జరుగుతున్న ప్రత్యేక ప్లీనరీలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ప్రజలు రవిశంకర్ గురూజీ నుంచి ఆధ్యాత్మిక సందేశం ఆశిస్తున్నారన్నారు. రోజువారీ పనుల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం కోరుతున్నామన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వివిధ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ధనవంతుల కన్నా… పేద ప్రజలు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారన్నారు. ప్రజలందరూ జీవన విలువలు, విధానాలు తెలుసుకోవాలన్నారు.