పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అసెంబ్లీలో ఈ ఏడాది బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత కొన్ని రోజులుగా ముంబైలోని లీలావతి హాస్పటల్లో చికిత్స పొందిన ఆయన ఇవాళ నేరుగా అసెంబ్లీకి వచ్చారు. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన పనాజీ చేరుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తన ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. 62 ఏళ్ల పారికర్ కొన్నాళ్లుగా ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈనెల 15వ తేదీన ఆయన ముంబై హాస్పటల్లో చేరారు.