అక్టోబరు 13 నుంచి 16 వరకు మండ్య జిల్లా కేఆర్ పేట్ తాలూకాలోని త్రివేణి సంగమంలో జరగనున్న దక్షిణ భారత మహాకుంభమేళాకు సంబంధించిన లోగోను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం విడుదల చేశారు.మహాకుంభమేళాకు లక్షలాది మంది జనం హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.సెరీకల్చర్, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ నారాయణగౌడ్, ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్, ఎమ్మెల్యే ఎల్ నాగేంద్ర, మండ్య డీసీ ఎస్ అశ్వతి తదితరులు పాల్గొన్నారు.