యూపీలోని రాంపూర్ జిల్లా ఆసక్తికర ఘటన జరిగింది. షోయబ్, రూబీనాలకు 9 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే తరచూ భర్త వేధించే వాడు. ఇటీవల తలాక్ చెప్పి వదిలించుకున్నాడు. ఇంటి నుంచి సైతం ఆమెను గెంటేశాడు. అయితే ఆమెను భర్త స్నేహితుడు ప్రేమ్పాల్ గంగ్వార్ చేరదీశాడు. దీంతో అతడితో ప్రేమలో పడింది. పుష్పగా పేరు మార్చుకుని శుక్రవారం భర్త స్నేహితుడు ప్రేమ్పాల్ను వివాహం చేసుకుంది.