ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం విజయవాడ జోన్ పరిధిలో 2500 బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి చెప్పారు. శనివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు విజయవాడ జోన్-2 పరిధిలోని ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి దూరప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు చెప్పారు.