ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో రాజ్యసభ, లోక్సభ టీడీపీ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి న్యాయం జరిగే వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. సభ్యులందరూ సభకు హాజరు కావాలని, నిరసనలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.పార్లమెంట్ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు.రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం జరగాలన్నారు. విభజన రోజు పార్లమెంట్లో ఉన్న పార్టీలే ఇప్పుడూ ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీకి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పార్టీలన్నింటిపై ఉందన్నారు. మూడున్నరేళ్లలో కేంద్రం రాష్ట్రానికి చేసింది కొంతేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా చూడాల్సింది కేంద్రమేనని పేర్కొన్నారు. చేస్తాం, చూస్తాం అంటే ప్రజలు నమ్మరని, ఆ స్థాయి దాటిపోయిందన్నారు. కావాల్సింది హామీలు కాదు.. చేతలు, స్పష్టమైన కార్యాచరణ అని పేర్కొన్నారు.