మాలే: మాల్దీవుల్లో సంక్షోభం మరింత ముదిరింది. ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్తో పాటు మరో జడ్జి అలీ అహ్మాద్ను అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అరెస్టుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇంకా అందలేదు. రాజకీయ రెబల్స్ను విడిచిపెట్టాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఆ ఆదేశాలను బేఖాతరు చేశారు.