రాష్ర్ట విభజన చేసి ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని 13 జిల్లాలకు ఐటి సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను ఆ పార్టీ నియమించింది. ఈ రోజు నుంచే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాల వారీగా ఇన్ ఛార్జీల వివరాలు:
అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప – పీఎస్ అహ్మద్ హుస్సేన్
ప్రకాశం, నెల్లూరు – అంబటి రామకృష్ణ
గుంటూరు, కృష్ణా – ఎస్కే మౌలాలి
పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి – తాళ్లూరి విజయ్ కుమార్
విశాఖపట్నం అర్బన్, రూరల్ – మనోహర్ గంగిరెడ్డి
విజయనగరం, శ్రీకాకుళం – డాక్టర్ బి.సతీష్