ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇచ్ఛాపురం సమస్యలపై సీఎంకు వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 01:11 PM

ఇచ్ఛాపురంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం రూ. పది కోట్ల నిధులు మంజూరు చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరినట్లు పురపాలక సంఘ అధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి తెలిపారు. ఆమదాలవలసలో స్పీకర్ కుమారుడి వివాహ కార్యక్రమానికి శనివారం వచ్చిన ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించానన్నారు. బహుదనది గ్రోయిన్లను అభివృద్ధి చేస్తే పంటల సాగుకు ఇబ్బందులు తప్పుతాయని, ముంపు సమస్య కూడా ఉండదని అందుకు రూ. 2 కోట్లు అవసరమని, రాజావారి మైదానం అభివృద్ధికి రూ. 4 కోట్లు, డైలీ మార్కెట్ ను మోడల్గా తీర్చిదిద్దేందుకు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ. 4 కోట్లు అవసరమని కోరినట్లు రాజలక్ష్మి తెలిపారు. ఈ నిధులు మంజూరైతే ఇచ్ఛాపురం ప్రాంతీయుల చిరకాల సమస్యలకు మోక్షం కలిగినట్లేనన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com