తెలుగుదేశం సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి(80) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతి చెందారు. అనపర్తి నియోజకవర్గంలోని తన స్వగ్రామం రామవరంలో నివసిస్తున్న మూలారెడ్డి మొదటి నుంచి టీడీపీ నేతగా కొనసాగుతున్నారు.