ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. మంత్రి పెద్దిరెడ్డి బిడ్డను మించిన పాపాలు చేశారని ఆరోపించారు. ఎర్రచందనం రవాణాలో నయా వీరప్పన్ గా పేరుగాంచిన పుంగనూరు డాన్ మంత్రి అయ్యాక వైన్ , మైన్ , ల్యాండ్ , ఇసుక మాఫియాలకు కింగ్ పిన్ గా మారాడని తెలిపారు. పాడిరైతులు పాపాల భైరవుడిగా మారారని లోకేష్ విమర్శించారు.