ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అగ్నిపథ్'పై వ్యతిరేకతల నేపథ్యంలో వివిధ స్టేషన్లలో రైళ్ల నిలిపివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 12:20 PM

'అగ్నిపథ్'పై వ్యతిరేకతల నేపథ్యంలో శనివారం విధ్వంసం జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో ఏపీ, తెలంగాణలో రైల్వేస్టేషన్‌లకు భద్రత పెంచారు. ఇక విశాఖకు విజయవాడ నుంచి వచ్చే రైళ్లను దువ్వాడ, అనకాపల్లి స్టేషన్లలో నిలిపి వేశారు. భువనేశ్వర్ నుంచి వచ్చే రైళ్లను కొత్తవలస స్టేషన్లలో ఆపి వేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు అక్కడే దింపి వేసి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com