చదువురాని వాడు కాకరకాయ అంటే చదువువచ్చిన వాడు కీకరకాయ అన్నాడట. ఇంగ్లీష్ మీడియం లో చదివాక ఉన్నమతి పోయినట్టు... పదవ తరగతి పరీక్షల్లో 67 శాతం ఏంటి సర్? 71 పాటశాలల్లో 100 శాతం ఫెయిల్ ఏంటి సర్? అని మాజీ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాస్ ప్రశ్నించారు. పదవ తరగతి ఫలితాలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ... మీరేమైనా నిరక్షాస్య రాష్ట్రం చేస్తామని ఎన్నికల్లో హామీ ఏమైనా ఇచ్చారా? ఇప్పటికే 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామని చెబుతున్నారు కదా, అలానే ఈ హామీ ని కూడా నెరవేర్చారా అనే సందేహమే, సెటైర్ కాదు, ఏమీ అనుకోకండి 2015 లో 91.42 శాతం , 2016 లో 93.26 శాతం , 2017 లో 91.92 శాతం , 2018 లో 94.48 శాతం , 2019 లో 94.88 శాతం... ప్రతీ ఏడాదికేడాది స్థిరమైన, గణనీయమైన ప్రగతిని సాధించిన చరిత్రకు పాతరేస్తూ నాణ్యమైన విద్యను అందించడం లో మొదటి నుంచి మూడో స్థానం లో ఉన్న రాష్ట్రాన్ని చివరినుంచి మూడో స్థానానికి దిగజార్చేలా సాగుతున్న మీ పాలనను సంస్కరించి మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాం. నాడు-నేడు అని స్కూళ్ల రూపు రేఖలు మార్చామని చెబుతున్నారు కానీ విద్యార్థుల తలరాతలను కాలరాస్తున్నారు. టీచర్లకు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం లేదు, 5 తరగతులకు ఒకే టీచర్, కిండర్ గార్డెన్ నుంచి 3 వరకుప్రాథమిక విద్య అని, తర్వాత హై స్కూల్ అనీ, టీచర్లచేత పిల్లలకు పాఠాలు చెప్పడం మానిపించి బాత్ రూం ల నుంచి,భోజనాలు వడ్డిస్తూ ఫోటోలు అప్లోడ్ చేయడం లో బిజీ గా మార్చిన మీ విధానాలను సమీక్షించండి సర్. ఒక్క డీఎస్సీ లేదు, ఒక్క ఓరియంటేషన్ లేదు, ఒక్క ప్రణాళిక లేదు, రాజకీయం చేస్తున్నామని అనుకోవద్దు, రాజీలేని ప్రయత్నం చేద్దాం. మా సహకారం కావాలన్నా అందించడానికి మాజీ విద్యాశాఖ మంత్రిగా సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసారు .