ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్-2022 పరీక్ష మే 29 ఆదివారం జరగనుంది.ఈ వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. పాలిసెట్ కోసం 1,37,371 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 404 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 10 రోజుల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి.